భక్తి శ్రద్ధలతో సాయిపూర్ హనుమాన్ పల్లకి సేవ.
తాండూరు సెప్టెంబర్ 16(జనంసాక్షి)శ్రావణమాసం భజన ముగింపు సందర్భంగా తాండూరు పట్టణంలోని 9వ వార్డ్ సాయిపూర్ హనుమాన్ దేవాలయంలో పల్లకి సేవ అద్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. హన్ మాన్ పల్లకి సెవలో బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు పాల్గొన్నారు. శనివారం తాండూరు పట్టణం సాయిపూర్ లో కొలువుదీరిన హన్ మాన్ మందిరంలో గత నెల రోజుల నుండి శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగానే శనివారం శ్రావణమాసం భజన సమప్తి సందర్భంగా పల్లకి సేవ నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు పాల్గొని భక్తిశ్రద్ధలతో పల్లకిని మోశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో భగవంతుని ప్రార్థించాలని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని వేల్లడించారు.ఈ పల్లకిసెవలో సాయిపూర్ గ్రామస్తులు యువకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు