హిందు ఉత్సవ సమితి వినాయక చందా 25వేలు

.తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి) తాండూరులో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. ఆదివారం ఎన్.ఎస్పీ ట్రస్ట్ కార్యాలయంలో హిందు ఉత్సవ సమితి సభ్యులకు వినాయక చందను రూ. 25వేలు ఉత్సవసమితి సభ్యులకు శుభప్రద్ పటేల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందు ఉత్సవ సమితి సభ్యులు పూజారి పాండు, పట్లోళ్ల నర్సింములు, కిరణ్, అశోక్ ఎన్ ఎస్పీ ట్రస్ట్ సభ్యులు భానుప్రసాద్, కుర్వ బాలు, విజయ్, హరీష్, శ్రీశైలం, ఆబిద్ చౌష్ నరేష్ గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.