ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముస్తారు పాష మూడవ వర్ధంతి

చెన్నూర్ ,సెప్టెంబర్ 25 (జనం సాక్షి); విప్లవోద్యమ కార్మిక నేత విప్లవ శ్రామిక వర్గ పక్షపాతి ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముస్తారు పాషా మూడవ వర్ధంతి వాల్ పోస్టర్ ఐ ఎఫ్ టి యు నాయకులు ఎస్కే జానీ బాయ్ విడుదల చేయడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ 30న వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ ప్రధాన కార్యదర్శి ముస్తార్ పాషా మూడవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టి యు డివిజన్ అధ్యక్షులు మాసాని రమేష్ కార్మిక సోదరుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు మండల కమిటీ సభ్యులు అమ్ము బాయ్ మధు ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.