కోదండరాం, అమీర్ అలీఖాన్లకే మళ్లీ ఎమ్మెల్సీ..!!
అపోహలకు తావులేకుండా త్వరలోనే కేబినెట్ నిర్ణయం?
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ విషయంలో హైకోర్టు తీర్పు ఎట్టకేలకు ఈ వివాదానికి స్పష్టతనిచ్చింది. వారి నియామకానికి సంబంధించిన పిటిషన్ గత కొన్ని వారాలుగా న్యాయస్థానంలో పెండిరగ్లో ఉండగా.. వారిద్దరిని నియమించడాన్ని హైకోర్టు ఏమాత్రం తప్పుబట్టలేదు. కేవలం పున:సమీక్షించుకోవాలని సూచనలు చేసింది. దీంతో తిరిగి వారిద్దరిని మళ్లీ నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న కొన్ని అపోహలకు తావులేకుండా కోదండరాం, అమీర్ అలీఖాన్లకే మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం కల్పించేందుకు సీఎం రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే కేబినెట్ సమావేశంలో తీర్మానించి తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపనున్నట్టు సమాచారం.
తాజావార్తలు
- కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
- కలెక్టర్ గారు..దండం పెడతాం
- అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
- బడ్జెట్పై కేసీఆర్ పెదవి విరుపు
- ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం
- ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే
- హైదరాబాద్లో పడకేసిన పారిశుధ్యం
- మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక
- 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం
- లారీని ఢీకొన్న బైక్..ముగ్గురు యువకుల దుర్మరణం
- మరిన్ని వార్తలు