26 ఏండ్ల కృషికి దక్కిన ఫలితం.

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా డిఎల్ పాండు ముదిరాజు ఎంపికపట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ముదిరాజులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్12(జనంసాక్షి):
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లుగా 26సంవత్సరాలుగా కృషి పట్టుదల తో తన వృత్తి లో నిబద్ధతను చాటుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొం టూ బలహీన వర్గాల కుటుంబం నుంచి రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా నియమితులైన డి.ఎల్ పాండు ముదిరాజు కు రాష్ట్ర నలుమూలల నుండి ముదిరాజు లతో పాటు అనేక వర్గాల ప్రజలనుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన డిఎల్ పాండు ముదిరాజు హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా నియమితులైన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ముదిరాజు బందువులం దరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.హైకోర్ఠు దగ్గరకు వెళ్లి అతన్ని కలిసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపుతున్నారు.డిఎల్ పాండు ముదిరాజు గతంలో ఉమ్మడి రాష్ట్ర న్యాయస్థాన సంఘం ప్రధాన కార్యదర్శి గా, బార్ కౌన్సిల్ సెక్రటరీ గా, ఫిషరీష్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా, ఫుడ్ కార్పొరేషన్ సభ్యులుగా, ఇంటర్ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులను చేపట్టడం జరిగింది.సుప్రీం కోర్టులో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ తుది తీర్పును వెలువరిస్తూ 2010 లో బీసీ కమిషన్లు బీసీ.డి గ్రూపు నుంచి 1992- 2009 లో ఇచ్చిన జీవో నంబర్ 15 ను పునరుద్ధరించాల్సిందిగా సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడిస్తూ బీసీ కమిషనర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో న్యాయం చేయవలసిందిగా పిటిషన్ డిస్పోస్ చేస్తూ మంగళవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ కేసును హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన డిఎల్ పాండు ముదిరాజు వాదించారు.సుప్రీంకోర్టులో కేసు గెలవడంపై జిల్లా ముదిరాజ్ సంఘాలు,రాష్ట్ర ముదిరాజు సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన తెనుగు ముదిరాజు సంఘం నాయకులు సందు యాదగిరి డిఎల్ పాండు ముదిరాజు ను హైకోర్టు ఆవరణలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డిఎల్ పాండు ముదిరాజు మాట్లాడుతూ ముదిరాజు బిడ్డ ల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలుపడం జరిగింది.