3వ రోజుకు చేరిన వి ఆర్ ఎ సమ్మె
దండేపల్లి. జనంసాక్షి 27 తమ సమస్యలను వెంటనె పరిష్కరించలని నిరవధిక సమ్మె ను చేపట్టిన వీఆర్ఏలు తగ్గేది లేదంటూ సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన పే స్కేల్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు లేకపోతే రాబోయే రోజుల్లో వీఆర్ఏలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని అన్నారు పే స్కేల్ ను విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని . వీఆర్ఏలకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు