*30వ తేదిన జరిగే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు*

మాదిగ జెఎసి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి.అభిమాన్య….
నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 8(జనంసాక్షి)
నాగర్ కర్నూల్ మాదిగ జెఎసి ముఖ్యనాయకుల సమావేశం నాగర్ కర్నూల్ ప్రాథమిక సింగిల్ విండో పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి.అభిమాన్య మాట్లాడుతూ,30వ తేదిన అలయ్ బలయ్ కార్యక్రమాని జయప్రదం చేయాలని.హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్.పిడమర్తి రవి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు.ఈ యొక్క కార్యక్రమానికీ జిల్లా వ్యాప్తంగా మాదిగ జెఎసి నాయకులు,కార్యకర్తలు వేలసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో మాదిగ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి సురేష్,నాగర్ కర్నూల్,కల్వకుర్తి,అచ్చంపేట,కొల్లాపూర్ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి పిలుపు మేరకు మాదిగ జేఏసీ నాయకులు అలయ్ బలయ్ కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు మొహన్,వెంకటేష్,విరేశం,రామకృష్ణ,కర్ణకర్,శ్రీకాంత్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area