4న సహస్రగళ గీతార్చన

భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఈనెల 4న జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు సామూహిక భగవద్గీత పారాయణం, సహస్రగళ గీతార్చన నిర్వహించనున్నట్లు దేవాలయాలు , ధార్మిక సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.మొదటిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హిందూసంస్ధలు , భక్తులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నల్లాన్ చక్రవర్తులు వేణుగోపాలచార్యులు , తోట శ్యామ్ ప్రసాద్ , నాగవెళ్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్, తోట గణేష్ , బైరు విజయకృష్ణ , నామిరెడ్డి సత్తిరెడ్డి , ,ఈగ దయాకర్, వివిధ దేవాలయాల అర్చకులు , సభ్యులు తదితరులు పాల్గొన్నారు.