400 ఏకరాల భూములను కాపాడిన ఘనత మాదే
` కంచె గచ్చిబౌలి భూములపై విపక్షాలది దుష్ప్రచ్రారం
` రేవంత్రెడ్డే సీఎంగా ఉంటారు
` అభివృద్ధి, సంక్షేమంతో అవినీతిరహిత పాలన సాగిస్తున్నారు
` సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదు
` స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్(జనంసాక్షి):ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిరదని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. భూములపై కోర్టుª`లో కొట్టాడి వాటిని దక్కించుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఆయన గాంధీభవన్లో విూడియాతో మాట్లాడారు. ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. ఏఐ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్పచ్రారం చేశారు. హెచ్సీయూ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా? విద్యార్థులను ప్రభావితం చేసి ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్కు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ పక్రియ ఉంటుంది. ఐసీఐసీఐ నుంచి మేం ఎలాంటి లోన్లు తీసుకోలేదు. కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవు. రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులు సేకరిస్తున్నాం అని శ్రీధర్బాబు తెలిపారు. ఇదిలావుంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ఖండిరచారు. కేటీ-ఆర్ నోటికొచ్చినట్లు-గా మాట్లాడి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. టీ-జీఐఐసీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు- కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. టీ-జీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని, తద్వారా వచ్చిన డబ్బులే ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా టీ-జీఐఐసీలో పడ్డాయని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేటీ-ఆర్ చేసిన వ్యాఖ్యలతో.. కంచ గచ్చిబౌలి భూములు.. హెచ్సీయూ, అటవీ శాఖవి కాదని తేలిపోయిందని కిరణ్కుమార్ అన్నారు. పేద ప్రజలు సన్న బియ్యం అన్నం తింటుంటే.. భారాస నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు.
సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు
సీఎం పదవిపై మంత్రి శ్రీధర్బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డే సీఎంగా ఉంటారని, ఆయనే ఉండి తీరుతారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం చేస్తూ రేవంత్ అవినీతిరహిత పాలన చేస్తున్నారని కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమర్థులేనని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షనిర్వహించారంటూ వచ్చిన వార్తలను శ్రీధర్బాబు తోసిపుచ్చారు. ఆమె ఎలాంటి సమీక్ష నిర్వహించలేదన్నారు. ‘’ మమ్మల్ని కలవడానికే మీనాక్షి నటరాజన్ సచివాలయానికి వచ్చారు. అక్కడికి ఎవరైనా రావొవచ్చు. భాజపా, భారాస నాయకులు కూడా సచివాలయానికి వస్తారు’’ అని శ్రీధర్బాబు అన్నారు.