40,000/- విలువ గల నిషేధిత గుట్కా పట్టివేత

కొడంగల్, (జనం సాక్షి), జూలై . :  గుర్మిట్‌కల్ నుండి నిషేధిత గుట్కా పదార్థాలను వికారాబాద్ జిల్లా పరిధిలోని దౌలతాబాద్ పి.యస్ పరిధి మీదుగా మండలానికి  మహిమూద్ S/o బాబు మియా అనే వ్యక్తి అక్రమంగా నిషేధిత పదార్థాలను సరఫరా చేస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం తెలుసుకుని దేవదాసు హెడ్‌కానిస్టేబుల్ దౌలతాబాద్ పి.యస్, మరియు గోపాల్, రాంచెంద్ర కానిస్టేబుల్స్ వెంటనే వెళ్లి ఆటోని అదుపులోకి తీసుకుని పరిశీలించగా అందులో 40,000/- విలువగల నిషేధిత గుట్కా పదార్థాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు అడుగుగా కొడంగల్‌లోని పాన్‌షాప్ దుకాణం యజమాని ఐన ఫైజల్ అనే వ్యక్తి సూచనల మేరకు ఇట్టి నిషేధిత పదార్థాలను గుర్మిట్‌కల్ నుండి కొడంగల్‌కి తీసుకువస్తున్నానని సమాధానం చెప్పాడు. అట్టి వ్యక్తిని, ఆటోని, నిషేధిత పదార్థాలతో పాటుగా స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేశామని ఇంచార్జి దేవదాసు హెడ్‌కానిస్టేబుల్ దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ గారు తెలిపారు.