43 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి):

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 43మందిని ఐపీఎస్‌ అధికారులను వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.