చైనాలో భూకంపం: 47కు పెరిగిన మృతుల సంఖ్య

బీజింగ్‌: వాయువ్య చైనాలోని గన్సు ప్రాంతంలో సోమవారం ఉదయం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 47కు చేరింది. రిక్టర్‌స్కేల్‌పై 6.6తీవ్రత నమోదైన ఈ భూకంపం మింగ్లియాన్‌, జాంగ్లియాన్‌ కౌంటీలలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భూప్రకంపనల ధాటికి మింగ్జియన్‌ కౌంటీలో 380 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలోనే 45 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జాంగ్జియాన్‌ ప్రాంతంలోని ఐదు టౌన్‌షిప్‌ల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. సైన్యం , పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.