488 పరుగులకు ఆలౌట్
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 488 పరుగుల వద్ద ముగించింది. 70 పరుగులు చేసి అశ్విన్ అలీ వేసిన బంతికి చివరి వికెట్ గా ఔటవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ఇంకా భారత్ ఇంగ్లాండ్ కంటే 49 పరుగులు వెనకబడి ఉంది. భారత ఇన్నింగ్స్ లో మురళీవిజయ్ 126(301), చటేశ్వర్ పుజారా 124(206), అశ్విన్ 70(139), విరాట్ కోహ్లీ 40(95), సాహా 35(82) పరుగులు చేశారు.