58 పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా

` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ తెలిపారు.58 మంది పేర్లతో తొలి జాబితా ఉంటుందని వెల్లడిరచారు. చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు ఉంటాయని మురళీధరన్‌ స్పష్టం చేశారు. వామపక్షాలతో పొత్తుపై చర్చలు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో.. విజయావకాశానికి తొలి ప్రాధాన్యత, విధేయతకు రెండో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి, నేతలకే అవకాశం ఇచ్చామని, అన్ని మతాలు, కులాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాధాన్యత ఇస్తుందని మురళీధరన్‌ పేర్కొన్నారు.