పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల హింస

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ పంచాయితీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ముందు జరిగిన హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు కాంగ్రెస్‌ మద్దతుదారులు మృతిచెందారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన బాంబుదాడుల్లో ఈ మరణాలు సంభవించినట్లు సమాచారం. కాంగ్రెస్‌, సీపీఎం ఇప్పటివరకు ఆధిక్యంలో ఉన్న ఈ జిల్లాలో తృణమూల్‌ పట్టుసాధించడానికి ప్రయత్నిస్తుంది