శాకాంబరి దేవిగా శ్రీశైల భ్రమరాంబ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున అలయంలో ఆషాడ పౌర్ణమి పురస్కరించుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబదేవికి శాకాంబరి ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. దేవి మూలమూర్తి, ఉత్సవమూర్తులతో పాటు ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవతా మూర్తులను సుమారు 15 వేల కేజీల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మంగళహారతలు ఇచ్చారు. శాకాంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.