శాకాంబరిగా దర్శనమిస్తున్న శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు

రాజమండ్రి : భక్తులపాలిట కల్పవల్లిగా, ఎప్పుడూ బంగారు చీరతో అభయమిచ్చే శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు సోమవారం శాకాంబరిగా దర్శనమిచ్చారు. అషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో అమ్మవారు పలు రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్నారు. శాకాంబరి అలంకరణ కోసం 15టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వినియోగించినట్లు అర్చకులు తెలిపారు.