మరింత వరద సాయం కోసం కేరళ వినతి

తిరువనంతపురం: వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని మరింత సహాయం కోరుతూ ఆగస్టు ఒకటిన మరో వినతి పత్రాన్ని సమర్పించనుంది. మంగళవారం ఉదయం రాష్ట్రం మంత్రులతోను, రాష్ట్ర పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చిన కేంద్ర బృందంతోనూ చర్చించిన అనంతరం కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ ఈ విషయాన్ని తెలియజేశారు. వర్షాలకు దెబ్బతిన్న అన్ని ప్రాంతాల నష్టతీవ్రతను అంచనావేసి ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.