దిగ్విజయ్ సింగ్ను కలిసిన కేవీపీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం న్యూఢిల్లీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర అధిష్ఠానం నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆ నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరు అరగంటపాటు భేటీ అయ్యారు. మరోవైపు సమైక్యాంధ్ర కోసం ఆ ప్రాంతానికి చెందిన ఎంపీలు, మంత్రులు, నాయకులంతా ఈ రోజు ఉదయం సీఎం కిరణ్కుమార్రెడ్డితో న్యూఢిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే.