లగడపాటి సీడబ్ల్యూసీ సభ్యుడు కాదు : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుందని తెలిపారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నదని తేల్చిచెప్పారు. లగడపాటి రాజగోపాల్‌ లోక్‌సభ సభ్యుడు మాత్రమే అని సీడబ్ల్యూసీ సభ్యుడు కాదు అని స్పష్టం చేశారు. తెలంగాణపై లగడపాటి ప్రభావం ఉండదు అని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఆయన కోరారు. విభజన విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే ఆంటోని కమిటీకి చెప్పుకోవాలని సూచించారు.