ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. బీహార్‌లోని ధమారా రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన రుర్ఘటనలో మృతి చెందిన భక్తులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. టీడీపీ ఎంపీ లాన్‌జాన్‌ భాషా మృతికి  లోక్‌సభ సంతాపం ప్రకటించింది. ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.