రాజ్యసభలో ఎస్పీ, భాజపా సభ్యుల నినాదాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం అయిన రాజ్యసభ ఎస్పీ, భాజపా సభ్యుల నినాదాలతో మార్మోగింది. శాంతించాలని ఛైర్మన్‌ ఎంత విన్నవించినా సభ్యులు వినలేదు. మరోపక్క సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడాలంటూ తేదేపా ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందగోళ పరిస్థితి నెలకొంది.