స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 65.40గా ఉంది.