ఆవ్ హెల్ప్లైన్కి ఒక్కపూటనే 700 ఫోన్లు
ఢిల్లీ : అవినీతి పై ఫిర్యాదులు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ ఈ రోజు ఉదయం పని చేయడం ప్రారంభించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేసే ఈ హెల్ప్లైన్కి మధ్యాహ్నానికే 700 లకు పైగా ఫోన్లు వచ్చాయని ఆవ్ వర్గాలు పేర్కొన్నాయి.