పదేళ్ల నిర్మాణాలపై చర్చలకు సిద్ధమా!

` కాళేశ్వరంకు డీపీఆర్‌ ఉందా?
` బీఆర్‌ఎస్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌
` మన పిల్లలకు ఇక మూసీ పేరు పెట్టుకోవాలి
`ఆ స్థాయిలో నదిని ప్రక్షాళన చేస్తాం
` నదీ పరీవాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా!
` ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెడతాం
` గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసింది
` తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి
` వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు
` ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబద్‌(జనంసాక్షి):గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘’ఇంజనీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరం. 360 కి.విూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రేడియల్‌ రోడ్స్‌ విూ చేతుల విూదుగా నిర్మాణం కాబోతున్నాయి. ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్‌ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణం కాబోతున్నాయి. 55 కి.విూ మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతాం.మార్పు రావాలి, కాంగ్రెస్‌ గెలవాలన్న ఆలోచనతో ఆనాడు నేను చేపట్టిన ‘విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’కు విూరంతా మద్దతిచ్చారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పాను. నేను చెప్పినట్టే కేసీఆర్‌ ఉద్యోగం పోయింది.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశచెందారు. మా మంత్రి వర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు పరిష్కారం చూపించింది. 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశాం. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ఎల్బీస్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నాం. వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గం ఒకవైపు ఉంది. విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందరం నిలబెట్టుకుందాం. తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్ల కేసీఆర్‌ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారు. మొన్నటి వరకు ఆయన పొందిన గౌరవం తెలంగాణ ఉద్యమం ఘనతే తప్ప ఆయన గొప్పతనం కాదు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తాం
’’నదుల పేర్లను ఎంతోమంది తమ పిల్లలకు పెట్టారు. చాలా మందికి గంగ, యమున, కావేరి పేర్లు ఉంటాయి. మూసీ పేరును ఏ తండ్రి అయినా తమ కుమార్తెకు పెట్టుకున్నారా? మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిరది. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా? మల్లన్నసాగర్‌ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా? నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండి. భారాస పార్టీ నిధులు రూ.1500 కోట్లు దాటాయి. 2014కు ముందు భారాస ఖాతాలో ఉన్నదెంత.. ఇప్పుడెంత? పదేళ్లలో భారాస ఖాతాలోకి రూ.వందల కోట్లు ఎలా వచ్చాయి?’’ అని సీఎం ప్రశ్నించారు.మూసీ పరీవాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా? : పదేళ్ల నిర్మాణాలపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌? నాయకులకు సవాల్‌ విసిరారు. డీపీఆర్‌? లేకుండానే రూ.లక్షన్నర కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిపోయిందని ఆక్షేపించారు. మలన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ నాణ్యతపైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు. మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిరదని, ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ ప్రక్షాళన చేసి తీరతామని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి, పిల్లలకు నది పేరు పెట్టేలా అద్భుతంగా పునర్‌ నిర్మిస్తామని తెలిపారు.