ఏడో ర్యాంకును దక్కించున్న ఛటేశ్వర పుజారా

దుబాయ్‌: ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్టు ర్యాంకిగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఛటేశ్వర పుజారా ఏడో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకం సాధించిన విరాట్‌ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నాడు.బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదో స్థానంలో ప్రజ్ఞాన్‌ ఓజా ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఆల్‌ రౌండర్‌ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.