ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ఖాతాలనను కాగ్‌ ఆడిట్‌ చేయవచ్చు : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ : ప్రైవేట్‌ టెలికాం సంస్థల ఖాతాలను కాగ్‌ ఆడిట్‌ చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు సోమవారం పేర్కొంది. న్యాయమూర్తుల ప్రదీప్‌ నంద్రజోగ్‌, వి. కామేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ట్రాయ్‌ చట్టం కింద కాగ్‌ ఈ అడిట్‌ చేయవచ్చని తీర్పును వెలువరించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ యూనిఫైడ్‌ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్స్‌, సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలు పెట్టుకున్న వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.