శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: శ్రీవారిని కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు వీఐపీ ప్రారంభదర్శన సమయంలో జయేంద్ర సరస్వతి శిష్యబృందంలో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఠాధిపతికి ఈవో గోపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ఒమర్ అబ్దుల్లా సతీమణి
శ్రీవారిని ఈ రోజు ఉదయం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సతీమణి పాయల్ నాథ్ దర్శించుకున్నారు. ఇద్దరు కుమారులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తామని తితిదేకు డిక్లరేషన్ సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
కేంద్రమంత్రి సచిన్ పైలట్..
తిరుమల: శ్రీవారిని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి సచిన్ పైలట్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.