మాదకద్రవ్యాల వ్యాపారంలో పంజాబ్‌ మంత్రి హస్తం : నిందితుడి ఆరోపణలు

చండీఘర్‌ : మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఓ వ్యక్తి ఈ వ్యాపారంలో పంజాబ్‌ రెవెన్యూ మంత్రి బిక్రమ్‌ సింగ్‌ మజీతియా హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత నవంబర్‌లో జగదీశ్‌ భోలా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనిని నిన్న మొహాలీ కోర్టులో హాజరుపరచగా కోట్లాది రూపాయల ఈ విషయం తెలుసని ఆరోపించాడు. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని భోలా న్యాయస్థానాన్ని కోరాడు. ఈ ఆరోపణలపై మంత్రి విక్రమ్‌ సింగ్‌ స్పందిస్తూ జగదీష్‌ పేరొందిన నేరగాడని, అతని నేరానికి జీవిత శిక్ష పడే అవకాశం ఉందని అలాంటి వ్యక్తి మాటలను నమ్మాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.