750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన

*ఈ నెల 13 న
750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్
మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అందరికీ స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
మన రాష్ట్ర ప్రభుత్వం జరుపబోవు వజ్రోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 13 నాడు ఉదయం 09.00 గంటలకు మన మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నుండి రాజీవ్ చౌక్ వరకు 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తెలిపారు.ఈ కార్యక్రమం లో పట్టణ ప్రజలు. ప్రజాప్రతినిధులు. వ్యాపార వర్గాలు.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరు పాల్గొనాలని కోరారు