బస్సు లోయలో పడటం వల్ల 8 మంది మృతి

మంగళూరు: బస్సు లోయలో పడిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకొంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మంగళూరులోని సక్లేష్‌పూర్‌ నుంచి హసన్‌ జిల్లా బేలూర్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు బేలూరు శివారులో అదుపుతప్పిన బస్సు విశ్వసముద్ర సరస్సులో పడిపోవడంతో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పాతిక మందిదాకా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది విద్యార్థులున్నట్లు సమాచారం.