9వ రోజుకు చేరిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర

పాదయాత్రలో కదిలిన కాంగ్రెస్ శ్రేణులు*
జనం సాక్షి ,న్యూస్ శంకరపట్నం, ఆజాద్క,అమృత్ మహోత్సవంలో భాగంగా ఏఐసీసీ పిలుపుమేరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ ప్రారంభమైన పాదయాత్ర బుధవారం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో 9వ రోజుకు చేరింది కొత్తగట్టు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం రాత్రి బస చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వం పెళ్లి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి 9వ రోజు కొత్తగట్టు గ్రామం నుండి హుజూరాబాద్ మండలం సింగపూర్ కు పాదయాత్ర చేరింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకరపట్నం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, ప్రజావ్యతిరేక విధానాలనునిరసిస్తూ పాదయాత్ర చేపట్టినట్లుమాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, కేంద్రం సామాన్యులపై భారం పడే విధంగా ధరలు పెంచుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిటిసి ఉప్పు గల మల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు రవి సతీష్, మాజీ నీటి సంఘం చైర్మెన్ కవ్వ శ్రీనివాసరెడ్డి, రజక సంఘం మండలాధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి, చాంద్ ఫాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి,పంజాల వెంకటేశం గౌడ్, సారంగపాణి తదితరులు పాలుగోన్నారు.