9 న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్.

జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్6(జనంసాక్షి):
ఆగస్టు 29వ తేదీన మండల స్థాయిలో నిర్వహించిన సైన్స్ సెమినార్ లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు ఈనెల 9న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఉదయం 10 గంటల నుండి నిర్వహించ బడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్ లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్ ఈ నెల 22న నిర్వహించబడునని తెలిపారు.మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి (9989921105)సంప్రదించగలరని అన్నారు