అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో

హైదరాబాద్ : అక్టోబర్ 15, 16, 17,18వ తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు సిఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అంతకుముందు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అలాగే, 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో, అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదేరోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.