cఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా ఫ్రీడమ్ 2కె రన్ – కురవి ఎస్సై రాము నాయక్

 

– 2కె రన్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

కురివి ఆగస్టు-11 (జనం సాక్షి న్యూస్)

ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం 2 కె రన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించుటకు నిర్ణయించగా కురవి ఎస్సై రాము నాయక్ ఆధ్వర్యంలో 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ప్రీఢం రన్ లో కురవి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ,యువకులు, పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన యంపిపి గూగులోత్ పద్మావతి రవి నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా పిచ్చిరెడ్డి, జడ్పిటిసి బండి వెంకటరెడ్డి. జాతీయత
సమైక్యత ప్రతి ఒక్కరిలో పెంపొందించేందుకు అమర వీరులను స్మరించుకుంటూ, భారత్ మాతాకీ జై అనే నినాదంతో యువకులు, ఆర్మీ విద్యార్థులతో కలిసి రన్ లో పాల్గొంటూ, ఉత్సాహంతో పరుగులు తీశారు.అనంతరం 2 కె రన్ లో పాల్గొన్న విద్యార్థులకు,యువతకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో
ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బజ్జూరి ఉమా పిచ్చి రెడ్డి, జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి , తెరాస మండల పార్టీ అధ్యక్షులు తోట లాలయ్య,తెరాస జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి, తహశీల్దార్ ఇమ్మానియెల్,ఎంపీడీఓ సరస్వతి, టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య,కురవి ఎంపీటీసీ చిన్నం భాస్కర్, కొణతం విజయ్,తుకారాం నాయక్,ఇరుగు వెంకన్న,దుడ్డేల వినోద్,మల్లికార్జున్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు, యువకులు,ఆర్మీ కోచ్ సింధు వర్మ,యువకులు,అధికారులు వివిధ గ్రామాల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.