నాంపల్లిలోని దర్గాలో చాదర్ సమర్పించిన డిప్యూటీ మేయర్ దంపతులు

హైదరాబాద్ : నాంపల్లిలోని ప్రాచీన హజ్రత్ యూసూఫెయిన్ ఔర్ శరీఫెయిన్ దర్గా వద్ద గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి కలిసి చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రైతులకు మేలు కలిగేలా పంటలు పండాలని ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. దర్గా కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ దంపతులకు స్వాగతం పలికి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.