శంకర్ పల్లి లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

శంకర్పల్లి ఆగస్టు 01(జనంసాక్షి )మాజీ హోంశాఖ, మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంకర్పల్లిలో గురువారం టిఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అంతకుముందు శంకర్పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తాలో టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా చేసేందుకు సన్నద్ధం కాగా శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ ఆధ్వర్యంలో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.కొందరు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆకస్మాత్తుగా శంకరపల్లి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు లక్ష్మీనరసింహారెడ్డి మరి కొంతమంది టిఆర్ఎస్ యూత్ నాయకులు టిఆర్ఎస్వి నాయకులు ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంలో సఫలీకృతులయ్యారు. దిష్టిబొమ్మ దగ్ధం అంతా సినిమా పక్కిలో జరిగినట్లు కనిపిస్తోంది. పోలీసులు చౌరస్తాలో పహారా కాస్తున్నప్పటికీ టిఆర్ఎస్ యూత్ టిఆర్ఎస్ విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం పట్ల పోలీసులు సైతం కంగుతిన్నారు.