MRPS జెండా ఆవిష్కరణ మరియు మందా కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు

మక్తల్ జూలై 07 (జనంసాక్షి) MRPS ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో MRPS జండా ఆవిష్కరణ నిర్వహించారు అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం MRPS జిల్లా కన్వీనర్ జీర్గల్ నగేష్ మాదిగ
ఎస్సీ వర్గీకరణకై 28 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన నేటికీ ఎస్సీల వర్గీకరణ బిజెపి ప్రభుత్వం 100 రోజుల్లో చేస్తానని చెప్పింది నేటికీ వర్గీకరణ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు ఎమ్మార్పీఎస్ వర్గీకరణ సాధించుకునే వరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు గుడిసె వెంకటయ్, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ జ్ఞాన ప్రకాష్, ఎమ్మార్పీఎస్ ఉట్కూరు మండల ఇంచార్జ్ హనుమంతు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు భీమేష్, కృష్ణ మండల నాయకులు వెంకటేష్, మాగనూరు మండల నాయకులు మణిగిరి కృష్ణ, మక్తల్ నాయకులు చిన్న కృష్ణ, బుడగ జంగాల నాయకులు కృష్ణయ్య, కర్నే వెంకటేష్., తిప్రస్పల్లి రామచందర్, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area