ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్ మాట్లాడుతూ..విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు.