ముందే చెప్పిన జనంసాక్షి.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్

హైదరాబాద్ (జనంసాక్షి) : బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలయింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ ఆరోపించింది. ఈ క్రమంలో అధ్యక్షుడి అదేశాల మేరకు తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.‘‘ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అని పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది.