ఉదారత చాటుకున్న కూరాకుల గోపి

రఘునాథపాలెం, జూన్ 26 (జనంసాక్షి) : రఘునాథపాలెం మండల పరిధిలోని పాపటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ కూరాకుల నర్సయ్య తనయుడు గోపీ ఫర్నిచర్ వితరణ చేసాడు. కార్యదర్శి చెన్ను నాగరాజు విజ్ఞప్తి మేరకు పన్నెండు వేలు విలువ చేసే ఇరవై ఐదు కుర్చీలని గురువారం గ్రామ పెద్దల సమక్షంలో అందచేశారు. కార్యాలయంలో మౌళిక సదుపాయల కల్పనకు సహకరిస్తామని పలువురు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు దుంపటి నగేష్, లచ్చయ్య, ఆరెంపుల వెంకటేశ్వర్లు, చావా రామయ్య, కొనకంచి రామ చంద్రయ్య,అప్పని శంకర్, వడ్లమూడి వెంకటయ్య, వుంయ్యురు లక్ష్మయ్య,కొండపర్తి జగన్, చావా భద్రయ్య,చచ్చు లక్ష్మి నారాయణ పావురాల నర్సయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.