ఆంధ్రాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన

` గుంటూరు జిల్లాలో అరటితోటలపై స్టడీటూర్‌ ` సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్‌ తెనాలి(జనంసాక్షి):గురువారం గుంటూరు జిల్లా తెనాలి సవిూపంలోని కొల్లిపరలో అరటిసాగును తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్‌ లో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్‌ పాల్గొన్నారు.ఈ సందర్బంగా … వివరాలు

ఎంపి గోరంట్లపై వైసిపి నాన్చివేత ధోరణి

విచారణ జరపాలంటూ డిజిపికి వాసిరెడ్డి పద్మ లేఖ నిరసనగా మహిళా సంఘాల దిష్టిబొమ్మ దగ్ధం అమరావతి,అగస్టు6( జనం సాక్షి): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై చర్యలు తీసుకునే విషయంలో వైసీపీలో హైటెన్షన్‌ మొదలైంది. మూడు రోజులుగా ఆ పార్టీ అధిష్ఠానం చర్చోపచర్చలు సాగిస్తున్నా.. ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఆయనపై వేటు వేస్తే.. పార్టీకి జరిగే … వివరాలు

విశాఖలో మంకీపాక్స్‌ కలకలం

వైద్య విద్యార్థినికి వ్యాథి లక్షణాలు విశాఖపట్టణం,అగస్టు6( జనం సాక్షి): విశాఖకు చెందిన వైద్యవిద్యార్థిని మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉండడంతో నగరంలో కలకలం రేగింది. వైద్య,ఆరోగ్య శాఖాధికారుతో పాటు జిల్లా అధికారులు సైతం అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ కొన్ని రోజులుగా వ్యాధి లక్షణాలతో చికిత్సపొందుతున్నారు. ఆమె … వివరాలు

ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైకాపా ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది : చంద్రబాబు

అమరావతి: పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలనుకుంటే రాష్ట్రంలోని 5 కోట్లమంది పైనా పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.సంక్షేమ పథకాల్లో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైకాపా ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని చెప్పారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలోని వేపనపల్లి ‘విద్యాదీవెన’పై ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌పై కేసు … వివరాలు

మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచాలి-కలెక్టర్ శ్రీ హర్

రాజోలి ఆగస్టు 04(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా చేస్తున్న మన ఊరు మన బడి పనులను వేగంగా పూర్తి చేయాలని జోగులంభ గద్వాల్ జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం మండలం లో ఆయన పర్యటించారు. మన ఊరు మన బడి పనులు జరుగుతున్న పెద్ద … వివరాలు

ఎపి హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ హరిచందన్‌ అమరావతి,ఆగస్టు4జనం సాక్షి(): ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, దుప్పల వెంకటరమరణ, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యామ్‌ సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, తల్లాప్రగడ మల్లికార్జునరావులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ … వివరాలు

అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరైన సిఎం

వధూవరులను ఆశీర్వించిన జగన్‌ అనకాపల్లి,ఆగస్టు4(జనం సాక్షి): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం.. తుని … వివరాలు

తనలాగే అంతా జైలుకు వెళ్లాలన్నదే జగన్‌ మనోగతం

అవినీతిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు లోకేశ్‌పై దుష్పాచ్రారం దారుణం: టిడిపి అమరావతి,ఆగస్టు4(జనం సాక్షి ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగన్‌ జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. తనలాగే అంతా జైలుకు వెళ్లాలన్నదే ఆయన పన్నాగమని మండిపడ్డారు. అయితే తనలాగా అంతా అవినీతికి పాల్పడ్డారన్న … వివరాలు

పూలమార్కెట్లకు శ్రావణ శోభ

విశాఖపట్టణం,ఆగస్ట్‌4(జనం సాక్షి ): పూలమార్కెట్లకు శ్రావణ శోభ వచ్చింది. ఆనందపురం మండలంలోని వేములవలస రోజువారీ పూలమార్కెట్‌కు శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు నేడు వరలక్ష్మీ వ్రతం కావడంతో ర్కెట్‌కు కొనుగోలుదారుల తాకిడి అధికమైంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని కొనుగోలు చేయడానికి నగరం నుంచి మహిళలు అధికసంఖ్యలో వస్తున్నారు. … వివరాలు

9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల,ఆగస్ట్‌4(జనం సాక్షి ):తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాలచెంత ఈనెల 9వ తేదీ ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు … వివరాలు