ఎంసెట్ ఇంజినీరింగ్, ఫార్మసీ తుదివిడత సీట్ల ఖరారు రేపు సాయంత్రం వెల్లడి
హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్, ఫార్మసీ తుది విడత కౌన్సెలింగ్ సీట్ల ఖరారు రేపు సాయంత్రం వెల్లడి కానుంది. మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు సీట్లు కేటాయింపు వివరాలను వెబ్సైట్లో ఉంచుతారు. అంతకు ముందే తుది విడత కౌన్సెలింగ్కు హాజరైన విద్యార్థులవారీగా వారి కళాశాల వివరాలను సెల్ఫోన్లకు మేసేజీలు పంపుతారు.