ఖరీఫ్లో వరి నాటవద్దు
బోధన్ గ్రామీణం:ఖరీఫ్లో వరి నాటవద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి రైతులకు సూచించారు.బోధన్ మండలం పెంటాకుర్దు గ్రామంలో పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడతూ వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరులేదని,దీంతో విద్యుత్తు ఉత్తత్పి తగ్గిందని చెప్పారు.దీన్ని రైతులు గమనించి ప్రాజెక్టులు నిండిన తరువాత వరి నాటుకోవాలన్నారు.