ప్రారంభమైన యూపీఏ సమస్యమ కమిటీ సమావేశం

ఢిల్లీ: వివిధ అంశాలపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ సంఘం ఈ రోజు భేటీ అయ్యింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి యూపీఏలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ హాజరయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ యూపీఏ నుంచి వైదొలగిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే.