*భక్తిశ్రద్ధలతో జగదాంబ మాతాకి ప్రత్యేక పూజలు!

_________________________
లింగంపేట్ 24 ఆగస్టు (జనంసాక్షి)
 లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ తాండలో మంగళవారం తాండ వాసులు జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఐదు వారాలుగా ఉపవాసం ఉన్న తండావాసులు మంగళవారం ఉపవాసాలు వదిలి జగదాంబ మాతకి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.అనంతరం ఒక్క పొద్దులు వదిలారు.ఈ కార్యక్రమంలో తాండ నాయకుడు శంఖర్ నాయక్ తాండ పెద్దలు మోతిరాం,తార్య,చంద్య,సర్పంచ్ గోవింద్ ఆలయ కమిటి మెంబర్లు గిరిజన మహిళలు యువకులు పాల్గొన్నారు.