మమ్మల్ని దిగిపొమ్మనే హక్కు కోదండరాంకు ఎక్కడిది: నాయిని

కోదండరాం వెనక బాసులున్నారేమో.. మాకు బాసులు ప్రజలేని ఆయన చెప్పారు. మల్లన్నసాగర్ భూములకు, ఫాంహౌస్కు సంబంధం ఏమిటి..మల్లన్నసాగర్ బాధితులకు న్యాయం చేసి తీరుతామని నాయిని తెలిపారు. కోదండరామ్ విపక్ష నేతల మాదిరిగా మాట్లాడుతున్నారని నాయిని మండిపడ్డారు. మిషన్ భగీరథను కలలోనైనా ఊహించారా..అది టీఆర్ఎస్ కే సాధ్యమని ఆయన చెప్పారు. ఎక్కడైనా తప్పులు జరిగితే సరిచేసుకుంటామని నాయిని పేర్కొన్నారు.