రాష్ట్రపతి రేసులో మురళీ మనోహర్ జోషి

జోషీ ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు సీనియర్ భాజపా, సంఘ్ నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నేత దేవేంద్ర స్వరూప్ జోషీకి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.