రేపు భేటీ కానున్న సమాజ్‌వాది పార్టీ పార్లమెంటరీ బోర్డు

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందుకు సమాజ్‌వాది పార్టీ రేపు భేటీ అవుతుంది. పార్టీ పార్లమెంటరీ బోర్టు రేపు ఢిల్లీలో భేటీ అయి మన్మోహన్‌ సర్కార్‌కు మద్దతు కొనసాగించటం పై చర్చించనుంది.