వైఎస్సార్‌సీపీలోకి వెళ్లినా పార్టీకి నష్టం లేదు : బొత్స

విజయవాడ :  ఈనెల 7న నిర్వహించే కాంగ్రెస్‌ ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. ఒకరిద్దరూ వైఎస్సార్‌సీపీలోకి వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, ఎక్కువ మొత్తంలో వెళ్తారని ఆనుకోవటం లేదని తెలియజేశారు. మతోన్మాదం రెచ్చగొట్టేలా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా నేరమే అని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై కేంద్ర నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.